KDP: టీడీపీ 44వ ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి జబీవుల్లా పిలుపునిచ్చారు. కడపలో రేపు జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్టీ స్థాపకుడు ఎన్టీ రామారావు ఆశయాలను స్మరించుకుంటూ వేడుకలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమాలు ఘనంగా చేపట్టాలని పిలుపునిచ్చారు.