EG: రేపు తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు నిర్వహిస్తున్నట్లు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉదయం 9:00 గంటలకు సిటీ తెలుగుదేశం పార్టీ కార్యాలయం తిలక్ రోడ్ స్థూపం వద్ద జెండా ఆవిష్కరణ ఉండనుంది. నాయకులు, కార్యకర్తలు ఆవిర్భావ వేడుకల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే ఓ ప్రకటనలో తెలిపారు.