NZB: పరస్పర రాజీతో కోర్టు కేసులకు శాశ్వత పరిష్కారం సాధించవచ్చని మొదటి అదనపు జిల్లా జడ్జి హర్ష తెలిపారు. జిల్లా కోర్టు ఆవరణలో జాతీయ లోక్ అదాలత్ ప్రారంభించారు. లోక్ అదాలత్ ద్వారా సమయం, ధనం ఆదా అవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జీ దుర్గా ప్రసాద్, బార్ ప్రెసిడెంట్ సాయిరెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.