MLG: ప్రభుత్వ పథకాలను ప్రజలలోకి తీసుకువెళ్లాలని కలెక్టర్ దివాకర్ టీఎస్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 2న అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించేందుకు సిద్ధం కావాలని సూచించారు. గ్రామసభల్లో రైతు భరోసా, బీమా, రుణమాఫీ వంటి పథకాలపై వివరించాలని చెప్పారు. లబ్ధిదారుల జాబితాలను పారదర్శకంగా ప్రదర్శించి దరఖాస్తులు స్వీకరించాలని ఆదేశించారు.