BDK: సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం వర్కర్స్ యూనియన్ చేపట్టిన కొత్తగూడెం సింగరేణి హెడ్ ఆఫీస్ ముట్టడి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. కోల్ బెల్ట్ ప్రాంతాల నుంచి వేలాది మంది కార్మికులు, యూనియన్ కార్యకర్తలు భారీగా తరలివచ్చి పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం హెడ్ ఆఫీస్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించి మూడు గంటల పాటు ధర్నా చేపట్టారు. పలువురు నేతలను అరెస్ట్ చేశారు.