MULG: ములుగు పట్టణంలో పన్నులు చెల్లించేందుకు ఈనెల 31తో గడువు ముగుస్తుందని మున్సిపల్ కమిషనర్ రమేష్ సోమవారం తెలిపారు. తర్వాత జరిగే చెల్లింపులకు వడ్డీ వర్తిస్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో టాక్స్ వసూళ్లను పరిశీలించిన కమిషనర్, పలు గృహాలు, దుకాణ సముదాయాలకు వెళ్లి స్వయంగా పన్నులను వసూలు చేశారు. ఇప్పటివరకు 70 శాతం ఆస్తి పన్నులు వసూలైనట్లు వెల్లడించారు.