NZB : డ్రంకెన్ డ్రైవ్లో ముగ్గురికి జైలు శిక్ష, మరో 27 మందికి జరిమానా విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చినట్లు ట్రాఫిక్ ప్రసాద్ తెలిపారు. ఇటీవల నిజామాబాద్లో ట్రాఫిక్ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్లో 30 మందిపై కేసు నమోదు చేశారు. సోమవారం ట్రాఫిక్ ఏసీపీ మస్తాన్ ఆదేశాల మేరకు మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచారు. ఇందులో ముగ్గురికి జైలు శిక్ష విధించారు.