NTR: నందిగామ రెవిన్యూ డివిజన్లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీ కే పోసి బాబు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 7 అర్జీలు అందగా, రెవిన్యూ శాఖకు 3, విద్యా శాఖకు 2, వ్యవసాయ శాఖకు 1, సర్వే శాఖకు 1 అర్జీ వచ్చినట్లు తెలిపారు. అర్జీలను సంబంధిత అధికారులతో సమన్వయం చేసి సకాలంలో పరిష్కరించాలన్నారు.