ప్రకాశం: మర్రిపూడి మండలంలో దళారులు అక్రమంగా పొగాకు కొనుగోలు చేస్తూ రాత్రికి రాత్రే తరలిస్తున్నారు. వేలం కేంద్రాల్లో క్వింటా ధర రూ. 25,000 పలుకుతుండగా, దళారులు అమాయక రైతులను బురిడీ కొట్టించి కేవలం రూ. 21,000 కే కొంటున్నారు. నిబంధనల ప్రకారం పొగాకును కేవలం వేలం కేంద్రాల్లోనే విక్రయించాలి.