మార్కాపురం జిల్లా నూతన కలెక్టర్గా ఎం. విజయ సునీత శనివారం కలెక్టరేట్లోని ఆమె కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది ఆమెకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె తెలిపారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు.