HYD: బోయినపల్లి మార్కెట్ యార్డును డంప్ యార్డు చేశారని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఎంపీ మీడియాతో మాట్లాడుతూ.. గత 9 నెలలుగా చెత్తను తీసుకువెళ్లే కాంట్రాక్టర్లు, టాయిలెట్స్ కడిగే కార్మికులకు డబ్బులు రాకపోవడం వల్ల వందల లారీల చెత్త పేరుకుపోయిందన్నారు. అసలు యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. సమస్య పరిష్కరించకుంటే భారీ పోరాటం చేస్తామన్నారు.