MDCL: అల్వాల్ పట్టణంలో టెంపుల్ అల్వాల్లో గల హరిదాసు మండపంలో 75వ శ్రీ సీతారామ వసంత నవరాత్రి ఉత్సవంలో భాగంగా శనివారం స్వామివారికి అభిషేకం, సామ్రాజ్య పట్టాభిషేకంను బ్రహ్మశ్రీ మిరియంపల్లి వరుణ్ కుమార్ శర్మ గావించారు. సత్యనారాయణ స్వామి వ్రతం, సాయంత్రం అన్న ప్రసాద వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారామ సంకీర్తన సంఘ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.