ATP: గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా శనివారం సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శ్రీనివాసులు మాట్లాడుతూ.. పట్టణంలో ఎయిర్టెల్, ఫైబర్ నెట్వర్క్ పేరుతో రోడ్లన్నీ తవ్వి గుంతల మయం చేస్తున్నారన్నారు. తవ్విన గుంతలను పూడ్చకుండా అలాగే వదిలేయడంతో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. తక్షణమే గుంతలను పూడ్చాలని డిమాండ్ చేశారు.