TPT: నాయుడుపేట వైసీపీ కార్యాలయంలో డాక్టర్ బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ ఛైర్మన్ తంబిరెడ్డి జనార్దన్ రెడ్డి, జిల్లా నాయకులు మద్దాల సోమశేఖర్ రెడ్డి, మండల అధ్యక్షులు ఒట్టూరు కిషోర్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.