TPT: పెళ్లకూరు (మం) చిల్లకూరు గ్రామంలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడి కుటుంబానికి ధైర్యం చెప్పారని తెలిపారు. ‘దెబ్బకు దెబ్బే మా సిద్ధాంతం’ అంటూ రాబోయే రోజుల్లో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని ఆయన స్పష్టం చేశారు.