TPT: శ్రీ పుట్టపర్తి నారాయణ ఆచార్యుల జయంతి సందర్భంగా జిల్లా కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచార్యుల సేవలను స్మరించుకుంటూ, సమాజానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.