అనంతపురం నగరం సెకండ్ రోడ్డు పార్కులోని బీడీసీ సెంటర్ గ్రంథాలయాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వడ్డే వెంకట్ హామీ ఇచ్చారు. శనివారం ఆయన కేంద్రాన్ని సందర్శించి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ 1 నుంచి గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షల మెటీరియల్ అందుబాటులో ఉంచుతామని ప్రకటించారు.