CTR: పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వామ్యం కావాలని HM లక్ష్మణ్ కుమార్ రెడ్డి కోరారు. పుంగనూరు పట్టణం లినార్ట్ మున్సిపల్ హైస్కూల్లో పారిశుద్ధ్య అధికారులు స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నియంత్రణ, తడి చెత్త, పొడి చెత్త అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించి ప్రతిజ్ఞ చేయించారు.