PDPL: రామగుండం మున్సిపల్ సమావేశం సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి, ఇంఛార్జి కమిషనర్ అరుణ శ్రీకి 6వ డివిజన్ కార్పొరేటర్ తోకల శ్యామని బుధవారం వినతిపత్రం ఇచ్చారు. జనగామలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంటర్ లైటింగ్, మహిళా భవనం, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయాలని కోరారు. దేవాలయాలకు ఉచిత విద్యుత్ కల్పించాలని విన్నవించారు. ఈ కార్యక్రమంలో మేకల సమ్మన్న, జనగామ మహేందర్, తదితరులు పాల్గొన్నారు.