BDK: పాల్వంచ అంబేద్కర్ సెంటర్ వద్ద గుంతలు పడ్డ రోడ్లకు అధికారులు ఇటీవల మరమ్మతులు చేపట్టారు. శ్రీరామనవమి దృశ్య తత్కాలిక చర్యలలో భాగంగా పూడ్చిన గుంటలు, మరల ఒక్క రోజు తిరగకుండానే రోడ్డు మొత్తం కాంకర్ రాళ్ల తో నిండిపోయింది. బైక్ మీద వెళ్లే వాళ్ళు జారి కింద పడిపోయే ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. తిరిగి రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని కోరారు.