AP: మార్కాపురం బస్సు ప్రమాదంలో మృతదేహాలను కుటుంబసభ్యుల DNA ఆధారంగా గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి మాంసపు ముద్దలుగా మారిపోవడంతో గుర్తించలేని స్థితిలో ఉన్నాయి. మృతదేహాలు మార్కాపురం ప్రభుత్వాస్పత్రిలో ఉన్నాయి. పోలీసులు నెల్లూరు నుంచి ఫోరెన్సిక్ టీమ్ను రప్పిస్తున్నారు. క్షతగాత్రుల్లో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.