మెన్స్ టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 50+ పరుగుల భాగస్వామ్యాల్లో భాగమైన బ్యాటర్గా విరాట్ కోహ్లీ ప్రపంచ రికార్డు సృష్టించాడు. 211 సార్లు 50+ పార్ట్నర్షిప్స్తో అలెక్స్ హేల్స్(210)ను కోహ్లీ అధిగమించాడు. ఆ తర్వాతి స్థానాల్లో డేవిడ్ వార్నర్(200), బాబర్ అజామ్(196), క్రిస్ గేల్(191) ఉన్నారు. ఈ అరుదైన ఘనతతో టీ20 హిస్టరీలో కోహ్లీ టాప్లో నిలిచాడు.