NRPT: మద్దూరు మున్సిపాలిటీ పరిధిలోని భీంపురం 11వ వార్డులో తాగునీటి సమస్య పరిష్కారం కోసం బోర్ పనులు ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని కౌన్సిలర్ సంజీవ్ ప్రారంభించి, పనులను పరిశీలించారు. స్థానికులు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను త్వరలోనే పూర్తిగా పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఏవైనా సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని తెలిపారు.