MBNR: జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా అధ్యక్షతన DCCB సర్వసభ్య సమావేశం జరిగింది. చిన్న రైతులు, వ్యాపారులకు సులభంగా రుణాలు అందించాలని ఆమె సూచించారు. మహిళా సంఘాలు, పాడి పరిశ్రమలకు రుణాలు విస్తరించాలని, పాత రుణాల వసూళ్లు మెరుగుపరచాలని ఆదేశించారు. బ్యాంకింగ్ కార్యకలాపాల్లో RBI, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకత ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.