ATP: ఉరవకొండ మండలంలోని నింబగల్లు సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడటంతో హసీనా (45) అనే మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాద సమయంలో ఆటోలో 13 మంది కూలీలు ఉండగా, వారిలో మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.