టీ20 ప్రపంచకప్లో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ చరిత్ర సృష్టించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఫర్హాన్ రికార్డులకెక్కాడు. శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్లో అతడు 40* పరుగులు చేయడంతో ఈ రికార్డు నమోదైంది. ఈ క్రమంలో గతంలో 319 పరుగులతో ఉన్న విరాట్ కోహ్లీ రికార్డును, ఫర్హాన్ (323*) అధిగమించాడు.