AP: తానెప్పుడూ టెక్నాలజీని ప్రమోట్ చేస్తానని CM చంద్రబాబు అన్నారు. ఒకప్పుడు ఆర్థిక లావాదేవీలు, దరఖాస్తులు తపాలాశాఖ ద్వారానే జరిగేవన్నారు. కాలక్రమంలో టెలికాం రంగంలో అనేక సంస్కరణలు వచ్చాయని తెలిపారు. ఎంత సాంకేతికత వచ్చినా గ్రామీణ డాక్ సేవక్ల స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని చెప్పారు. దేశంలో 3 లక్షల మంది గ్రామీణ డాక్ సేవక్లు ఉన్నారని పేర్కొన్నారు.