AP: అభివృద్ధి, సంక్షేమానికి మార్గదర్శిగా టీడీపీ నిలిచిందని మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. TDP సర్పంచులు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘దోపిడీ సొమ్ము నుంచి వైసీపీ పుట్టింది. అవినీతి చేసేందుకే జగన్ సీఎం అయ్యారు. అవినీతిపరుడైన జగన్తో చంద్రబాబు పోరాడాల్సి రావడం బాధాకరం. రాజధాని అవసరం లేదనే నాయకుడు.. ప్రజలకు అవసరం లేదు’ అని విమర్శించారు.