కోసి ఉంచిన పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. పండ్లను కోసిన వెంటనే గాలిలోని ఆక్సిజన్తో చర్య జరిపి వాటిలోని కీలక పోషకాలు నశిస్తాయి. అంతేకాకుండా, ఎక్కువ సేపు బయట ఉంచిన ముక్కలపై బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్లు వచ్చే ప్రమాదం ఉంది. ఒకవేళ ముందే కోసి పెట్టుకోవాలనుకుంటే, వాటిని గాలి చొరబడని డబ్బాలో ఉంచి భద్రపరచుకోవడం ఉత్తమం.