కోనసీమ: గాడిలంక సర్పంచ్ ఎన్నికల్లో అక్రమాలపై ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు స్పందించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వెంకటకృష్ణారావు 14 ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు తేల్చిందన్నారు. గత వైసీపీ పాలనలో జరిగిన ప్రజాస్వామ్య హననానికి ఇది నిదర్శనమని మండిపడ్డారు. న్యాయపోరాటంలో విజయం సాధించిన అభ్యర్థి కృష్ణారావును, న్యాయవాది రెడ్డి సత్యనారాయణను టీడీపీ నాయకులు సన్మానించారు.