ATP: గుత్తి మున్సిపాలిటీలో శనివారం స్వర్ణాంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంపై ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ అధికారులు ప్రజలకు పరిశుభ్రత ప్రాముఖ్యత, మురిగినీటి నిర్వహణ, ప్లాస్టిక్ వినియోగ నివారణ తదితర అంశాలపై వివరించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులవ్వాలంటూ మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా పిలుపునిచ్చారు.