WGL: భద్రకాళి క్షేత్రంలో కళ్యాణ బ్రహ్మోత్సవాలు కనులపండువగా కొనసాగుతున్నాయి. రెండో రోజున అమ్మవారు ప్రాతఃకాల విశేష దర్శనమిచ్చారు. అర్చకులు ఉదయాన్నే అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు చేసి, శోభాయమానంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి దర్శించుకోగా తీర్థప్రసాదాలు అందజేశారు. ఈకార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, సిబ్బంది, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.