అధికంగా స్క్రీన్ను చూడటం వల్ల చిన్నారుల్లో ఏకాగ్రత లోపం, నిద్రలేమి సమస్యలు పెరుగుతున్నాయని జైపూర్ SMS ఆసుపత్రి సైకాలజిస్టు డా.జైశ్రీ జైన్ అధ్యయనంలో వెల్లడైంది. 10-16 ఏళ్ల పిల్లల్లో 72% మంది రోజుకు 6-7 గంటలు ఫోన్ వాడుతున్నారని, దీనివల్ల 60% మందిలో ఏకాగ్రత తగ్గుతోందని తేలింది. అలాగే 48% మందిలో చికాకు, 41% మందిలో నిద్రలేమి సమస్యలు ఉన్నట్లు గుర్తించారు.