తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే వేడిగాలులు కారణంగా ఉక్కపోతతో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. దీంతో చిన్నారులు, వృద్ధులు అయితే అల్లాడిపోతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 38 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.