PPM: అద్దె బస్సుల డ్రైవర్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు CITU జిల్లా కార్యదర్శి ఎస్.వై నాయుడు మాట్లాడుతూ.. గురువారం రాత్రి ఓనర్లకు, డ్రైవర్ ప్రతినిధులకు జరిగిన చర్చలు విజయవంతం అయ్యాయని తెలిపారు. డ్రైవర్లకు జీతాలు పెంచడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు ఓనర్లు బాధ్యత వహించడానికి, పండగ బోనస్ ఇవ్వడానికి ఓనర్లు సమ్మతించడంతో సమ్మె విరమించామన్నారు.