AP: వైసీపీ హయాంలో గృహ నిర్మాణంలో అక్రమాలు జరిగాయని మంత్రి పార్థసారథి పేర్కొన్నారు. ‘గత ప్రభుత్వకాలంలో ఇళ్ల పట్టాలిచ్చి భూములు ఇవ్వలేదు. భూములు కొని ఇస్తామని ప్రజలను మభ్య పెట్టారు. పేదలకు అర్బన్లో 2 సెంట్లు, రూరల్లో 3 సెంట్లు.. ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది’ అని వెల్లడించారు.