‘పెద్ది’ సినిమాలో ఢిల్లీ ఎపిసోడ్ హైలైట్గా నిలుస్తుందని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం భావోద్వేగాలు, మాస్ యాక్షన్ సీన్లతో నిండి ఉంటుందని, దర్శకుడు బుచ్చిబాబు దీనిని అద్భుతంగా చిత్రీకరించారని పేర్కొన్నాడు. ఈ చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందంటూ, షూటింగ్లో రామ్ చరణ్తో కలిసి దిగిన ఫోటోలను ఆయన పంచుకున్నాడు.