అల్లూరి జిల్లాను జోన్-1లోనే కొనసాగించాలని ఏపీ ఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్ర పాత్రుడు, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సింహాద్రి కోరారు. ఈమేరకు బుధవారం పాడేరు విచ్చేసిన రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణిని కలిసి వినతిపత్రం అందజేశారు. జిల్లాను జోన్-2లో చేర్చడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు.