KRNL: హోళగుంద మండలం సులువాయి గ్రామంలో మంగళవారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు ఆరు గడ్డివాములు మంటల్లో కాలిపోయాయి. ఈరన్న, వసంతకుమార్, రమేష్, పరుశురాంలకు చెందిన గడ్డివాములు అని స్థానికులు చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినా అప్పటికే భారీ ఆస్తి నష్టం జరిగిందిని వారు పేర్కొన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.