E.G: వాహనాల LED లైట్ల కారణంగా అత్యధికంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రతి వాహనం లైట్లకు బ్లాక్ స్టిక్కర్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి ఎస్.గిరీష్ కోరారు. సోమవారం రాజమండ్రి ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ సత్తిబాబుకు వినతి పత్రం అందించారు. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.