GNTR: గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి ప్రజల అవసరాలను తెలుసుకునేందుకు ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్ వార్డు పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సంగడిగుంట, కబాడీగూడెం ప్రాంతాల్లో పర్యటించిన ఆయన స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.