కృష్ణా: పెదప్రోలు గ్రామపంచాయతీ జూనియర్ అసిస్టెంట్పై గ్రామస్థులు సోమవారం PGRSలో ఫిర్యాదు చేశారు. పంచాయతీ నిధులను అధిక బిల్లులతో దుర్వినియోగం చేస్తున్నారని, కాంట్రాక్ట్ పనుల్లో తనకు అనుకూలమైన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. వీధి దీపాలు, పన్నుల సమస్యలు నెలలుగా పరిష్కారం కాలేదని వాపోయారు. వెంటనే ఆయనను బదిలీ చేయాలని కోరారు.