ATP: అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డు ప్రాంగణంలో ఈ వారం జరిగిన పశువులు, జీవాల సంతల ద్వారా రూ.4.50 లక్షలకు పైగా ఆదాయం లభించినట్లు మార్కెట్ యార్డ్ చైర్ పర్సన్ బల్లా పల్లవి తెలిపారు. అందులో శనివారం జరిగిన గొర్రెలు, మేకలు, పొట్టేళ్ల సంత నుంచి రూ.2.84 లక్షలు, ఆదివారం జరిగిన ఆవులు, ఎద్దుల సంత ద్వారా రూ.1.66 లక్షల మేర వసూలైనట్లు ఆమె మీడియాకు వెల్లడించారు.