TPT: జిల్లాలో ఇంటర్ తరగతులు ప్రారంభమై 15 రోజులు గడిచినా పుస్తకాలు అందక విద్యార్థులు పడుతున్న ఇబ్బందులపై అధికారులు స్పందించారు. నూతన సిలబస్ పుస్తకాలను RIO కార్యాలయానికి చేరవేశారు. బుధవారం నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు రాధాకృష్ణన్ కిట్ పుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు RIO రాజశేఖర్ తెలిపారు. త్వరలోనే అందరికీ పుస్తకాలు అందుతాయని ఆందోళన చెందవద్దని ఆయన పేర్కొన్నారు.