అన్నమయ్య: మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ జీవి పల్లవికి హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోలేదనే ఆరోపణలపై దాఖలైన కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో కోర్టు ధిక్కారంగా భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న కోర్టులో హాజరుపరచాలని ఎస్పీకి ఆదేశాలు జారీ అయ్యాయి.