VZM: దత్తి రాజేరు మండలంలోని దత్తి గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి దర్శనానికి ఈ నెల 21వ తేదీన చినజీయర్స్వామి వస్తున్నట్లు ఆలయ ధర్మకర్త పెంకి తిరుపతినాయుడు ఓ ప్రకటనలో ఆదివారం తెలిపారు. ఆరోజు ఉదయం ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొని, భక్తులకు ఆధ్యాత్మిక సందేశం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.