NDL: నంద్యాల జిల్లాలో ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం నేడు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. వెలుగోడు, ఆత్మకూరు, కొత్తపల్లి మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. వడగాలుల తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలోని పలుప్రాంతాల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.