KKD: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేపథ్యంలో సామర్లకోట పట్టణ పరిధిలో గల పరీక్ష కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పటిష్ట బందోబస్తులను చేపట్టినట్టు సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ పేర్కొన్నారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు.