E.G: గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఆధ్వర్యంలో పంగిడిగూడెం నుంచి ద్వారకా తిరుమల వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ ఆశయ సాధనే లక్ష్యంగా జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు, యువత పెద్దసంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు. సామాజిక న్యాయం కోసం ఆయన చూపిన బాట స్ఫూర్తి దాయకమని ఎమ్మెల్యే పేర్కొన్నారు.