ప్రకాశం: కందుకూరు పట్టణంలోని పామూరు రోడ్డులో పొగాకు గూడెం నందు పేకాట ఆడుతున్న 9 మందిని ఎస్సై శివ నాగరాజు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ. 9,330 స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా ఎస్సై శివ నాగరాజు హెచ్చరించారు. మత్తుపదార్థాలకు, పేకాటకు యువత దూరంగా ఉండాలని సూచించారు.